చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి..ఆ తర్వాత గమనం వంటి సినిమాలు చేసినా..సరైన గుర్తింపు రాలేదు. అయితే హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్న శివ కందుకూరి..ఇపుడు భూతద్ధం భాస్కర్ నారాయణగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. పురుషోత్తం రాజ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు
లేటెస్ట్గా హీరో విశ్వక్ సేన్ భూతద్ధం భాస్కర్ నారాయణ ట్రైలర్ను రిలీజ్ చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ‘ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని విధంగా దారుణ హత్య జరిగింది, ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు” అనే న్యూస్ బులిటెన్ వాయిస్ తో మొదలై ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ ఏరియాలో..ఏ హత్య జరిగిన..అది భాస్కర్ నారాయణ కంట పడాల్సిందే..ఆ కేసు సాల్వ్ అవ్వాల్సిందే..అని డైలాగ్తో ఇంటెన్స్ స్టార్ట్ చేశారు. ఒక సీరియల్ కిల్లర్ అతి కిరాతంగా..ఒక్క క్లూ కూడా లేకుండా ఎక్కడో తల నరికేసి..వేరే చోట పడేస్తుంటారు. అలా ఆ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్, దేవి ప్రసాద్, షఫీ, శివన్నారాయణ, కల్పలత కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ మార్చి1న థియేటర్లో రిలీజ్ అవుతోంది.