
ముంబై: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్నుగాయానికి చేసిన సర్జరీ సక్సెస్ అయింది. లండన్లోని ఓ హాస్పిటల్లో మంగళవారమే అతనికి సర్జరీ చేశారు. గురువారం అతను లేచి కొంతదూరం నడిచినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ గాయంతో అయ్యర్ ఐపీఎల్తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిన్ ఫైనల్కు దూరం అవుతున్నాడు. 28 ఏండ్ల శ్రేయస్ పూర్తిగా కోలుకొని బరిలోకి దిగేందుకు మూడు నెలల టైమ్ పట్టనుంది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ నాటికి అతను పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంది.