హెల్మెట్, సీటు బెల్టే.. నా ప్రాణాలు కాపాడినయ్ : సిద్దూ జన్నలడ్డ

హెల్మెట్, సీటు బెల్టే.. నా ప్రాణాలు కాపాడినయ్ : సిద్దూ జన్నలడ్డ
  •     రెండు యాక్సిడెంట్లలో బతికి బయటపడ్డా.. 
  •     డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ
  •     సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్‌‌‌‌ సేఫ్టీపై  అవేర్ నెస్   
  •     వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు
  •     హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: సిటీలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డీజే టిల్లు హీరో  -సిద్దు జొన్నలగడ్డ సూచించారు. మన ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలను కాపాడాలని.. హైదరాబాద్‌‌‌‌ను జీరో యాక్సిడెంట్ జోన్‌‌‌‌గా చూడాలని ఉందని పేర్కొన్నారు.  ముందుగా ట్రాఫిక్ రూల్స్‌‌‌‌కు సంబంధించిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఆడియో రికార్డ్‌‌‌‌ ను లాంచ్ చేసిన ఆయన.. గతంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదాలపై వివరించారు.

రెండు యాక్సిడెంట్లలో హెల్మెట్‌‌‌‌, సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ నే ప్రాణాలు కాపాడాయని గుర్తుచేశారు. రోడ్‌‌‌‌ సేఫ్టీలో భాగంగా ఆటో డ్రైవర్లు, స్టూడెంట్స్‌‌‌‌కు సిటీ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం అత్తాపూర్‌‌‌‌‌‌‌‌లోని కింగ్స్ ప్యాలెస్‌‌‌‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గెస్ట్ గా సిద్దు హాజరై తన యాక్సిడెంట్ అనుభవాలను వివరించారు.  ‘‘ నేను ఇంజనీరింగ్‌‌‌‌ చదివే రోజుల్లో కీసరగుట్ట నుంచి ఈసీఐఎల్‌‌‌‌ వైపు బైక్ పై వెళ్తున్నా.. నా వెనకాలే వచ్చిన బైక్‌‌‌‌ ను  ఓవర్ టేక్ చేస్తుండగా హ్యాండిల్స్‌‌‌‌ తగిలి కింద పడ్డాం.  అప్పుడు 70 నుంచి 80 స్పీడ్‌‌‌‌ ఉన్నాం. నా హెల్మెట్‌‌‌‌ పగిలిపోయింది. హెల్మెట్‌‌‌‌ లేకుంటే నా తల కూడా అలా పగిలిపోయేది. మరోసారి రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తుండగా.. మా కారు 120 స్పీడ్‌‌‌‌తో పల్టీ కొట్టింది. సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ నా ప్రాణాలు కాపాడింది. రెండు యాక్సిడెంట్లలో  ప్రాణాలతో బయటపడ్డాను కాబట్టే డీజే టిల్లుగా మీకు దగ్గరయ్యా ”అని తనకు జరిగిన యాక్సిడెంట్లను గుర్తుచేశారు. 

ట్రాఫిక్ రూల్స్ పాటించట్లే..

సిటీలో చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదని సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. డిసిప్లేన్‌‌‌‌తో డ్రైవింగ్‌‌‌‌ చేయాలని, ట్యాక్సీ, ఆటో డ్రైవర్స్‌‌‌‌ జాగ్రత్తగా నడిపితే ట్రాఫిక్ కంట్రోల్‌‌‌‌లో ఉంటుందని సూచించారు. మన డ్రైవింగ్ తో  ఇతరులకు హాని, ఇబ్బంది, ట్రాఫిక్ జామ్‌‌‌‌లకు కారణం కావొద్దని పేర్కొన్నారు. 
ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు వాహనదారులు సహకరించాలని, తప్పు చేయడం వల్ల ఎదుటి వారు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సిటీలో 1.20లక్షల ఆటోలు ఉన్నాయని, రూల్స్ పాటించని కొంతమంది డ్రైవర్స్‌‌‌‌ తో అందరు ఇబ్బంది పడాల్సి వస్తుందని  ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ చెపపారు. ఎక్కడపడితే అక్కడ ఆపడం, పార్కింగ్‌‌‌‌ చేసే పద్ధతి మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.