
తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఏటా స్కాలర్షిప్ అందిస్తోంది. ఇందుకోసం సీబీఎస్ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి సీబీఎస్ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హతలు : విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి.
రెండేళ్లు స్కాలర్షిప్: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.cbse.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.