
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కి… మరోసారి కోసం వచ్చింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నిర్లక్ష్యం వహించారంటూ ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకట్ రెడ్డిపై ఫైరయ్యారు. గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్… రోడ్లపై పేరుకుపోయిన చెత్త, కంపు కొడుతున్న డ్రైనేజీని చూసి తీవ్రస్థాయిలో స్పందించారు. సిగ్గుగా అనిపించడం లేదా అంటూ గ్రామ కార్యదర్శిని కడిగిపారేశారు. సర్పంచ్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కలెక్టర్. సర్పంచ్ సమాధానం చెబుతున్నా సంతృప్తి చెందని కృష్ణ భాస్కర్… గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు. 30 రోజుల కార్యాచరణలో విఫలమయ్యారంటూ సర్పంచ్, ఈవో లకు మెమో జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు.