కోర మీసాల స్వామికి స్వర్ణ కిరీటం

కోర మీసాల స్వామికి స్వర్ణ కిరీటం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామికి బంగారు కిరీటం చేయిస్తున్నట్టు మంత్రులు హరీశ్​రావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో మల్లన్నకు చేయించబోతున్న కిరీట నమూనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా స్వామికి రూ.4 కోట్లతో ఆరున్నర కిలోల  బంగారు కిరీటాన్ని చేయించనున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో కిరీటాన్ని సమర్పిస్తామన్నారు. వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఈఓ బాలాజీ పాల్గొన్నారు..