కింగ్ నాగార్జునను ఢీ కొట్టడానికి..సై అంటున్న తమిళ విలన్!

కింగ్ నాగార్జునను ఢీ కొట్టడానికి..సై అంటున్న తమిళ విలన్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ నా సామి రంగ.  ఈ మూవీని ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.ఈ మూవీలో నాగ్ లుంగీ కట్టుకొని, బీడీ కాలుస్తూ ఊర మాస్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు.

నాగ్ని ఢీ కొట్టడానికి విలన్ గా తమిళ యాక్టర్..డైరెక్టర్ ఎస్ జె సూర్య నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్కు చాలా ఇంపార్టెన్స్ ఉండనుందని టాక్. ఇప్పటికే స్పైడర్ మూవీలో ఎస్. జె. సూర్య‌ని విలన్గా చూసిన ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఎస్.జె. సూర్య అయితేనే ఇంపాక్ట్ అంటుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలో నా సామి రంగ నుంచి ఆఫీసియల్ అనౌన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రసెంట్ రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీలో విలన్గా ఎస్.జె. సూర్య  నటిస్తున్నారు. 

నాగ్ 99వ మూవీ అయినా నా సామి రంగ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న నాగ్..తన స్వాగ్ ను చూపించే అవకాశం వచ్చిందని సినీ క్రిటిక్స్ తెలుపుతున్నారు. ఇక నాగార్జున నుంచి రాబోయే 100వ మూవీ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ అక్కినేని ఫ్యాన్స్ లో నెలకొంది.

రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ ఫ్యాన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. నా సామి రంగ మూవీకి ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా..శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.