చల్లటి కబురు..జూన్ 4న కేరళకు రుతుపవనాలు

చల్లటి కబురు..జూన్ 4న కేరళకు రుతుపవనాలు

ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనానికి  చల్లటి కబురునిచ్చింది వాతావరణ శాఖ  స్కైమెట్. జూన్ 4 నాటికి రుతుపవనాలు కేరళ తీరానికి తాకనున్నాయని .. జూన్‌ 29 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుతాయని చెప్పింది. 2019 లో సరాసరి వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుందని వెల్లడించింది. తూర్పు,ఈశాన్య,వాయువ్య, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది స్కైమెట్ .