రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా అమేథి నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు నామినేషన్ వేశారు. అమేథి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నించున్న ఆమె.. గురువారం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి తన నామినేషన్ ను దాఖలు చేశారు.
కాగా ఆమె ఈ స్థానం నుంచి పోటీ చేయడం రెండోసారి. గత 2014 ఎన్నికల్లో కూడా స్మృతి ఇరానీ.. రాహుల్ కు పోటీగా ఇదే స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సుమారు ఒక లక్షా ఏడు వేల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.