
సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో సోమవారం సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు మంత్రుల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ లో అన్ని కులాలు, మతాల వారికి సమప్రాధాన్యం లభిస్తోందన్నారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పాటించిన సామాజిక న్యాయం దేశ రాజకీయాలకు ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మాజీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు చింతమళ్ల రమేశ్, లక్ష్మణ్ గౌడ్, కుంభం రాజేందర్, రుద్రంగి రవి, సిరివెళ్ల శబరి, ఆలేటి మాణిక్యం, ఉపేందర్, దివ్య, కుందమళ్ల శేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జవహార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ చారి, పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి, నూతనకల్ మండల అధ్యక్షుడు అశోక్, నాగారం మండల అధ్యక్షుడు వలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.