నీవు చస్తే కడుపు తీయించుకుని .. నచ్చినోన్ని పెళ్లి చేసుకుంటానని టార్చర్
శాయంపేట, వెలుగు: ‘నువ్వు చస్తే కడుపు తీసేసుకొని వేరే పెళ్లి చేసుకుంటా.. నువ్వు ఇంకా ఎందుకు బతుకుతున్నావ్ చావు ’ అంటూ భార్య పెట్టే టార్చర్ భరించలేక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొండ రాకేశ్(28) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుపల్లికి చెందిన కొండా వెంకట్రాజం పెద్ద కొడుకు రాకేశ్ హైదరాబాద్ హెచ్ సీ ఎల్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ఫ్రం హోమ్లో ఉన్న అతనికి ఏలుకుర్తి హవేలీ కి చెందిన దేవులపల్లి శంకర్ కుమార్తె నిహారికతో ఫిబ్రవరిలో పెళ్లయ్యింది. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. నిహారిక ప్రస్తుతం గర్భవతి. పల్లెటూరులో ఉండడం ఇష్టం లేని నిహారిక హైదరాబాద్ వెళ్దామని రాకేశ్ గొడవపడింది. ఆఫీసు ప్రారంభమైన తర్వాత వెళ్దామని భర్త చెప్పినా వినకుండా గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.
పెద్దల సమక్షంలో పంచాయతీ జరగగా రాకేశ్ ఉండడం తనకు ఇష్టం లేదని, గర్భం తీసుకుంటానని నిహారిక భర్తతో, అత్తమామలతో గొడవపడింది. అత్తమామలను చీపురుతో కొట్టి తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు వీడియో కాల్ చేసి ‘ నువ్వు ఎందుకు బతికి ఉన్నావురా.. చావురా.. నువ్వు చస్తే గర్భంతీసేసుకుని నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొంటా’ అంటూ వేధించింది. ఈ మేరకు రాకేశ్సూసైడ్ నోట్ రాసి గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ములుగు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుని తండ్రి వెంకట్రాజం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మృతుని భార్య నిహారిక, శంకర్, అరుణ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై వీరభద్రరావు తెలిపారు.