
కోల్బెల్ట్, వెలుగు: తల్లి మెడలోని బంగారు చైన్ను చోరీ చేసిన కొడుకు అరెస్టైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. మందమర్రి రైల్వే స్టేషన్ వద్ద ఉండే విజయపురి పుల్లమ్మ (76) అనారోగ్యం బారినపడి మంచాన పడింది. గత నెల 24న రాత్రివేళ ఆమె మెడలోని రెండు తులాల బంగారు చైన్చోరీకి గురైంది. బాధితురాలి మనుమడు శివ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుల్లమ్మ కొడుకు శంకరయ్యను పోలీసులు అనుమానించి ఆరా తీయగా.. తనే చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే చైన్ను చోరీ చేసినట్టు పేర్కొన్నాడు. చైన్రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.