మంచిర్యాల జిల్లాలో తల్లి బంగారు గొలుసు కొట్టేసిన కొడుకు అరెస్ట్

మంచిర్యాల జిల్లాలో తల్లి బంగారు గొలుసు కొట్టేసిన కొడుకు అరెస్ట్

కోల్​బెల్ట్, వెలుగు: తల్లి మెడలోని బంగారు చైన్​ను చోరీ చేసిన కొడుకు అరెస్టైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.  బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. మందమర్రి రైల్వే స్టేషన్​ వద్ద ఉండే విజయపురి పుల్లమ్మ (76) అనారోగ్యం బారినపడి మంచాన పడింది. గత నెల 24న రాత్రివేళ ఆమె మెడలోని రెండు తులాల బంగారు చైన్​చోరీకి గురైంది. బాధితురాలి మనుమడు శివ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పుల్లమ్మ కొడుకు శంకరయ్యను పోలీసులు అనుమానించి ఆరా తీయగా.. తనే  చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు.  ఆర్థిక ఇబ్బందులతోనే  చైన్​ను చోరీ చేసినట్టు  పేర్కొన్నాడు. చైన్​రికవరీ చేసి నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.