సోనియా గాంధీకి మాతృవియోగం

సోనియా గాంధీకి మాతృవియోగం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.

సోనియా గాంధీ కొన్నిరోజుల క్రితమే విదేశాలకు వెళ్లారు. అనారోగ్యానికి చికిత్స తీసుకోవడానికి ఆమె విదేశాలకు వెళ్తున్నట్లు పార్టీ తెలిపింది. ఆమెకు తోడుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వెళ్తారని చెప్పింది. ఏ దేశం వెళ్తున్నారన్నది మాత్రం చెప్పలేదు. కానీ ఢిల్లీకి వచ్చేముందు సోనియా తన తల్లిని కలిసి వస్తారని జైరాం రమేష్ వెల్లడించారు. ఇంతలోనే సోనియా తల్లి మరణించారు.