కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : సోయం బాపురావు

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : సోయం బాపురావు

కాగజ్ నగర్, వెలుగు: భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ మండలంలోని సార్సాల గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 గ్రామాల్లో అవసరమున్న చోట సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ వేస్తామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. వికసిత్​భారత్​పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యవర్గ సభ్యుడు గోళం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.