భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని లాడ్జీల యజమానులంతా నిబంధనలను పాటించాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్లో జిల్లాలోని లాడ్జీల యజమానులతో శనివారం సమావేశం నిర్వహించారు. లాడ్జీకి వచ్చే వారి పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, ప్రభుత్వ ఐడీ కార్డును తీసుకోవాలన్నారు.
విదేశీయులు లాడ్జీలో బస చేస్తే వారి వివరాలను ఆన్లైన్లో సమాచారం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్స్టేషన్ల ఫోన్ నంబర్లను రిసెప్షన్ వద్ద పొందుపర్చాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
