తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జులై 2న రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్నివాసంలో ఆయన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. సాయి చంద్పాట వింటూ స్పీకర్ కన్నీరు పెడుతూ... ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సాయి భార్యను నేతలు ఓదార్చారు.
మింట్కంపౌండ్లో సంతాప సభ..
సాయిచంద్మృతి పట్ల తెలంగాణ మాల సంఘాల జేఏసీ సంతాపం తెలిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్ అంబేడ్కర్ స్ఫూర్తి భవన్ లో జరిగిన సంతాప సభలో నేతలు ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళి అర్పించారు. జేఏసీ ఛైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ.. సాయి భార్యకు గ్రూప్1 పోస్ట్ కింద ఉద్యోగం కేటాయించి కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.