సాయిచంద్​ కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్​ పోచారం

సాయిచంద్​ కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్​ పోచారం

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్​ సాయిచంద్​అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అసెంబ్లీ స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. జులై 2న రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్​నివాసంలో ఆయన శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. సాయి చంద్​పాట వింటూ స్పీకర్​ కన్నీరు పెడుతూ... ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని అన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.  అనంతరం సాయి భార్యను నేతలు ఓదార్చారు. 

మింట్​కంపౌండ్​లో సంతాప సభ..

సాయిచంద్​మృతి పట్ల తెలంగాణ మాల సంఘాల జేఏసీ సంతాపం తెలిపింది. హైదరాబాద్ మింట్​కంపౌండ్​ అంబేడ్కర్​ స్ఫూర్తి భవన్ లో జరిగిన సంతాప సభలో నేతలు ఆయన చిత్రపటానికి పులమాల వేసి నివాళి అర్పించారు. జేఏసీ ఛైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ.. సాయి భార్యకు గ్రూప్​1 పోస్ట్ కింద ఉద్యోగం కేటాయించి కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.