సెంట్రల్​లో 2,049 పోస్టులకు ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ​ నోటిఫికేషన్​

సెంట్రల్​లో 2,049 పోస్టులకు ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ​ నోటిఫికేషన్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ)2,049 సెలక్షన్‌‌‌‌ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేస్తోంది. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనిష్టంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌‌‌‌- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), జనరల్ అవేర్‌‌‌‌నెస్ (25 ప్రశ్నలు, 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అరిథ్‌‌‌‌మెటిక్ స్కిల్) (25 ప్రశ్నలు, 50 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌) (25 ప్రశ్నలు, 50 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షకు గంట సమయం కేటాయించారు. 

దరఖాస్తులు: మార్చి 18 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌‌‌‌మెన్ క్యాండిడేట్స్​కు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. పరీక్ష మే 6 నుంచి 8వరకు నిర్వహిస్తారు. వివరాలకు www.ssc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.