- ప్రపోజల్స్పెట్టాలని కేబినెట్
- సబ్ కమిటీలో నిర్ణయం
- ఆఫీసర్లతో కేటీఆర్, హరీశ్ భేటీ
హైదరాబాద్, వెలుగు : గత ప్రభుత్వాల టైమ్ లో లీజుకిచ్చిన భూములను ఎట్లా అమ్మాలనే దానిపై సర్కార్ దృష్టి సారించింది. నిధుల సమీకరణలో భాగంగా ఖాళీ భూములతో పాటు వాటిని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ప్రధానంగా హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైన ఆజామాబాద్ అజ్మాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా భూములు ఉన్నాయి. నిధుల సమీకరణపై సోమవారం బీఆర్కే భవన్లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.
ఈ సందర్భంగా ఇప్పటి వరకు అమ్మిన భూములు, వచ్చిన ఆదాయంపై చర్చించారు. మిగిలిన భూములను అమ్మడంతో పాటు పారిశ్రామిక భూములను ఎలా అమ్మాలన్న దానిపై చర్చించారు. ఇప్పటికే అసెంబ్లీలో పాసైన ఇండస్ట్రియల్ ఏరియా లీజుల రెగ్యులరైజేషన్ సవరణ యాక్ట్ ప్రకారం అలాటీస్కు, ఇతరులకు విక్రయించే భూములపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో పాటు హఫీజ్పేట్, బాలానగర్ ఇండస్ర్టీయల్ భూములనూ అమ్మాలని నిర్ణయించారు.
