Farm house case : బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

Farm house case : బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

ఫాం హౌస్ కేసులో బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై హైకోర్టు మరో ఆరు వారాల పాటు స్టే పొడిగించింది. ఇవాళ్టితో స్టే గడువు ముగియడంతో సంతోష్ తరఫు న్యాయవాది దాన్ని పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి తొలుత రెండు వారాల గడువు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉందన్న విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో హైకోర్టు స్టేను ఆరు వారాలకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.