హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కర్నాటక ప్రభుత్వం యాడ్స్ ఇవ్వడంపై బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు ఇచ్చారు. జవదేకర్ శనివారం బీర్కే భవన్ లో సీఈఓను కలిసి కర్నాటక ప్రభుత్వం ఇక్కడ ప్రకటనలు ఇవ్వకుండా చూడాలన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీలు ప్రకటనలు ఎక్కడైనా ఇవ్వొచ్చు కానీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కర్నాటక ప్రజల నిధులను తెలంగాణలో ఎలా ఖర్చు చేస్తారన్నారు. ఇప్పటికే కర్నాటక నిధుల కొరతను ఎదుర్కొంటుందని ప్రజలకు పథకాలు సరిగ్గా అందడం లేదన్నారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. 2014, 2018 లో ఈ విధంగా జరిగిందన్నారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని విమర్శించారు.