సుభాష్ చంద్రబోస్ అందరికీ తెలసులు.. కానీ, మోహన్ సింగ్ ఎంతమందికి తెలుసు?

సుభాష్ చంద్రబోస్ అందరికీ తెలసులు.. కానీ, మోహన్ సింగ్ ఎంతమందికి తెలుసు?

ఇండియన్​ నేషనల్​ ఆర్మీ

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1942 ఫిబ్రవరి నాటికి సింగపూర్​లోని బ్రిటిష్​ ప్రభుత్వం జపాన్​కు లొంగిపోయింది. ఈ సమయంలో కొన్ని వేల మంది భారత యుద్ధ ఖైదీలు జపాన్​కు పట్టుబడ్డారు. ఈ ఖైదీలను భారత ఆర్మీ అధికారి మోహన్​సింగ్​కు జపాన్​ సైన్యాధిపతి ఫూజివారా అప్పగించారు. యుద్ధ ఖైదీలతో బ్రిటిష్​కు వ్యతిరేకంగా ఇండియన్​ నేషనల్​ ఆర్మీని ఏర్పాటు చేసేలా మోహన్​సింగ్​ను జపనీయులు ఒప్పించారు. 1942 ఆగస్టులో మోహన్​సింగ్​ 40 వేల మంది యుద్ధ ఖైదీలతో ఇండియన్​ నేషనల్​ ఆర్మీని సింగపూర్​లో ఏర్పాటు చేశారు.

ఐఎన్​ఏ రూపకర్త, స్థాపకుడిగా కెప్టెన్​ మోహన్​సింగ్​ను పిలుస్తారు. ఈ సంస్థ మార్చ్​ ‘కదమ్​ కదమ్​ బడాయే జా’. దీనిని రామ్​సింగ్​ ఠాకూర్​ కంపోజ్​ చేశాడు. ఆ తర్వాత ఐఎన్​ఏ పాత్రపైన జపాన్​ సైనికాధికారులకు, మోహన్​సింగ్​కు వచ్చిన వివాదాల వల్ల మోహన్​సింగ్​, నిరంజన్​సింగ్ గిల్​లు అరెస్టయ్యారు. ఇదే సమయంలో జపాన్​లో ప్రవాస జీవితం గడుపుతున్న రాస్​ బిహార్​ బోస్​ టోక్యోలో 1942లో ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​ని స్థాపించాడు.

బ్యాంకాక్​లో జరిగిన సదస్సులో రాస్​బిహారీ చైర్మన్​గా ఉన్న ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​ కిందికి ఐఎన్​ఏను తీసుకురావాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇది ఐఎన్​ఏలో విలీనమైంది. జపాన్​, రాస్​ బిహార్​ బోస్​ ఆహ్వానం మేరకు సుభాష్​ చంద్రబోస్​ సింగపూర్​ వెళ్లి రాస్​బిహారీని కలిసి 1943లో ఇండియన్​ ఇండిపెండెన్స్​ లీగ్​, ఐఎన్ఏ బాధ్యతలు స్వీకరించాడు. సుభాష్​ చంద్రబోస్​ 1943 ఆగస్టు 25న ఐఎన్​ఏ సుప్రీంకమాండర్​గా బాధ్యతలు స్వీకరించాడు. 

ఆజాద్​ హింద్​ ఫౌజ్​

సుభాష్​ చంద్రబోస్​ ఇండియన్​ నేషనల్​ ఆర్మీని పునర్వ్యవస్థీకరించి ఆజాద్​ హింద్​ ఫౌజ్​గా మార్చాడు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టడం. ఆజాద్​ హింద్​ ఫౌజ్​ ఇండియన్​ నేషన్​ ఆర్మీ, ఇండియన్​ ఇండిపెండెంట్​ లీగ్​ల కలయికగా ఉండేది. ఈ ఫౌజ్​ భారతీయులను సైన్యంలో చేరాలని ఉత్తేజితున్ని చేయడానికి ఆజాద్​ హింద్​ రేడియోని ఉపయోగించింది.

భారత దేశం స్వాతంత్ర్యం పొందడం కోసం జపాన్​ పూర్తిగా సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని టోజో సుభాష్​ చంద్రబోస్​కు హామీ ఇచ్చాడు. ఈ రేడియో ద్వారా 1944, జులై 6న బోస్​ ఈ రేడియో ద్వారా గాంధీని జాతిపిత అని సంబోధిస్తూ భారత తుది పోరాటానికి గాంధీ ఆశీస్సులను కోరారు. ఐఎన్​ఏ ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్​ జిందాబాద్​. ఈ నినాదాన్ని మౌలానా హస్రత్​ మోహానీ రూపొందించాడు. ఐఎన్​ఏ ప్రధాన కేంద్రాన్ని 1944 జనవరిలో బర్మాలోని రంగూన్​కు మార్చారు. 

ఐఎన్​ఏలోని రెజిమెంట్స్​

ఇండియన్​ నేషనల్​ ఆర్మీ ప్రధాన కేంద్రాన్ని సుభాష్​ చంద్రబోస్​ సింగపూర్ లో స్థాపించాడు. సుభాష్​ చంద్రబోస్​ 1943, నవంబర్​ 6న అండమాన్​ నికోబార్​ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీద్​ దీవులని, నికోబార్ దీవులకు స్వరాజ్​ దీవులని పేరు పెట్టాడు. 1944 మార్చి 18న హింద్​ ఫౌజ్​ బర్మా సరిహద్దును దాటి భారత నేలపై అడుగు పెట్టింది. బహదూర్​ గ్రూప్​కు చెందిన కల్నల్​ మాలిక నేతృత్వంలో ఏప్రిల్​ 14న మొదటిసారిగా భారత ప్రధాన భూభాగంలోని మొయిరాంగ్​ (మణిపూర్​) వద్ద ఐఎన్​ఏ జెండాను ఆవిష్కరించారు.

ఇక్కడే మూడు నెలలు సైనిక పాలన నిర్వహించారు. ప్రస్తుతం మొయిరాంగ్​లో ఐఎన్​ఏ మెమోరియల్​ కాంప్లెక్స్​ ఉంది. 1944లో హింద్​ ఫౌజ్​ సైన్యం కోహిమా దండయాత్రలో భాగంగా చలో ఢిల్లీ, జైహింద్​ నినాదాలతో ఢిల్లీని ఆక్రమించి బ్రిటిష్​ పాలనను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ 1944లో జపాన్​ దళాల నుంచి సరైన సహకారం ఐఎన్​ఏకు అందకపోవడంతో 1945 మేలో బ్రిటిష్​ వారు రంగూన్​ను ఆక్రమించారు. ఈ ఆక్రమణతో ఐఎన్​ఏ సైనికులు బ్రిటిష్​ వారికి యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. దీంతో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్ర్య పోరాటం ముగిసింది. 

ఎర్రకోట విచారణ

భారత జాతీయ సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలను బ్రిటిష్​ వారు 1945 నవంబర్ 5న ఎర్రకోట వద్ద విచారణ చేశారు. దీన్నే ఐఎన్​ఏ విచారణ లేదా ఎర్రకోట విచారణ అంటారు. ఇందులో ప్రేమ్​ కుమార్​ సెహెగల్​, షా నవాజ్​ ఖాన్​, గుర్​బక్ష్​ సింగ్​ ధిల్లాన్​లు నిందితులుగా ఉన్నారు. వీరిని విడుదల చేయాలని ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​, ముస్లిం లీగ్​, ఆర్​ఎస్​ఎస్​, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్​ పార్టీ, జస్టిస్​ పార్టీ విజ్ఞప్తి చేశాయి. వీరి తరఫున భూలాభాయ్​ దేశాయ్​, తేజ్​బహదూర్​ సఫ్రూ, కెలాస్​నాత్​ కట్జు, జవహర్​లాల్​ నెహ్రూ, అరుణా అసఫ్​ అలీ వాదించారు.

ఈ విచారణ నవంబర్​ 5 నుంచి 11 వరకు వారం రోజులపాటు జరిగింది. దీన్నే ఐఎన్​ఏ వారం అంటారు. నవంబర్​ 12ను ఐఎన్​ఏ దినంగా పరిగణించారు. చివరికి 1945 డిసెంబర్​ 13న యుద్ధ ఖైదీల విచారణ ముగిసింది. ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఆనాటి భారత్​ సర్వసైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్​ క్లాడ్​ అచిన్​లేకన్​ బ్రిటిష్​ ప్రధాని అట్లీని ఒప్పించి, శిక్షలు రద్దు చేయించారు.

ఇండియన్​ నేషనల్​ ఆర్మీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2018లో అండమాన్​ నికోబార్​లోని కొన్ని ద్వీపాల పేర్లను మార్చాడు. 


నీల్​ ద్వీపం​    షహీద్​ ద్వీపం
హావ్​లాక్​ ద్వీపం    స్వరాజ్​ ద్వీపం
రాస్​ ద్వీపం         సుభాష్​ చంద్రబోస్​ ద్వీపం    ఆజాద్​ హింద్​ 
ఇది ఆక్రమిత సింగపూర్​లో 1943 అక్టోబర్​ 21న ఏర్పడింది. దీనిని జపాన్​, నాజీ జర్మనీ బలపరిచింది. 
రాజధాని: పోర్ట్​ బ్లెయిర్​
ప్రధాని: సుభాష్​ చంద్రబోస్​ (1943–45)
కరెన్సీ: రూపాయి
ఆజాద్​ హింద్​ చరఖాతో ఉన్న త్రివర్ణ పతాకాన్ని కలిగిన ప్రభుత్వం. దీని మధ్యలో పులి గుర్తును వాడారు. 
మంత్రివర్గం: సుభాష్​ చంద్రబోస్​ – ప్రధాని, యుద్ధ, విదేశీ వ్యవహారాలు 
కెప్టెన్​ లక్ష్మీ సెహెగల్​ – మహిళా అభివృద్ధి
ఎంఏ అయ్యర్​    బ్రాడ్​ కాస్టింగ్​,
         పబ్లిసిటీ
హెచ్​.సి. చటర్జీ    ఆర్థిక మంత్రి
ప్రభుత్వ లీగల్​ అడ్వైజర్​    ఎ.ఎన్​.సర్కార్​
సుప్రీం అడ్వైజర్    రాస్​బిహారీ బోస్​
ప్రభుత్వ సెక్రటరీ    ఎ.ఎం.సాహే 
ఈ ప్రభుత్వం బ్రిటన్​, అమెరికాలపై యుద్ధాన్ని ప్రకటించింది.