సూపర్ స్టార్ రజినీకాంత్తో మలేషియా ప్రధాని.. వీరి భేటీకి కారణం ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్తో మలేషియా ప్రధాని.. వీరి భేటీకి కారణం ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) జైలర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. లేటెస్ట్ గా రజినీ మలేషియాకు వెళ్లారు. మలేషియా ప్రైమ్ మినిష్టర్ అన్వర్ ఇబ్రహీం(Anwar Ibrahim) రజినీతో భేటీ అయ్యారు. ప్రసెంట్ వీరిద్దరి మీటింగ్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా సేపు భేటీ అయినా వీరు..పలు రాజకీయా అంశాలపై మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం తన  ట్విట్టర్లో స్పందిస్తూ..ఆసియాతో పాటు..అంతర్జాతీయా కళా ప్రపంచంలో ఫేమస్ యాక్టర్ ను కలిశాను. ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల..రజినీ ఇచ్చిన గౌరవాన్ని అభినందిస్తున్నాను. అలాగే ఫ్యూచర్ లో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని, అలాగే తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ  రాణించాలని కోరుకుంటున్నట్లు..తన ట్వీట్‌లో ప్రధాని అన్వర్‌ పేర్కొన్నారు. 

బస్ కండక్టర్ గా స్టార్ట్ అయినా ప్రస్థానం..నేడు దేశ విదేశాలకు చేరడంతో ఫ్యాన్స్ రజినీ కాంత్ రేంజ్ ఇదంటూ..కామెంట్స్ తెలుపుతున్నారు.కాగా సూపర్ స్టార్ రజినీ ఒక్క మలేషియాలోనే కాకుండా..మరిన్ని దేశాలలో తన హవా వ్యాపించింది.
  
గతంలో కబాలి మూవీ షూటింగ్ టైంలో రజినీ మలేషియా కి వెళ్ళినపుడు..నజీబ్‌ రజాక్‌(Najib Razak) ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు.అప్పుడు వీరిద్దరీ మీటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక మరోసారి మలేషియా వెళ్లిన రజినీ..ప్రస్తుతం ప్రధానిగా ఉన్న అన్వర్ ఇబ్రహీంను కలిసినట్లు తెలుస్తుంది.  

సూపర్ స్టార్ రజినీకాంత్తో మలేషియా ప్రధాని.. వీరి భేటీకి కారణం ఏంటో తెలుసా?