వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కీలక ఆదేశాలు

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం కీలక ఆదేశాలు

ఢిల్లీ:  వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు పై కీలక తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. లోక్ సభ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని చెప్పింది. ఇప్పటి వరకు ప్రతీ అసెంబ్లీ యోజకవర్గంలో ఒక్క వీవీ ప్యాట్ స్లిప్పును మాత్రమే లెక్కించేవారు. దీనిపై 21 పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. అయితే 50 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ వాదనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సుప్రీం తీర్పుతో ప్రతిపక్షాలకు ఊరటనిచ్చింది.