విద్యుత్ ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్ ను మార్చండి : కేసీఆర్ పిటీషన్ పై సుప్రీంకోర్టు

విద్యుత్ ఎంక్వయిరీ కమిషన్ చైర్మన్ ను మార్చండి : కేసీఆర్ పిటీషన్ పై సుప్రీంకోర్టు

కేసీఆర్ పదేళ్ల పాలనలో.. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను తప్పించాలని.. కొత్త వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది. విచారణ అధికారిని మార్చి విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

 విద్యుత్ ఎంక్వైరీ  కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ఇవాళ విచారించింది.   కేసీఆర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జుడీషియరీ కమీషన్ నియామకం చట్టప్రకారం జరుగలేదని వాదించారు.  మాజీ సిఎం పిటిషన్ ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కొట్టేసిందని చెప్పారు. తాము రిప్లై ఇవ్వకుండానే  పిటిషన్ డిస్మిస్ చేసిందన్నారు.  జుడీషియరీ కమీషన్ ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.  ఎంక్వైరీ పూర్తవ్వకముందే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తప్పు చేశారని చెప్పారని కోర్టుకు తెలిపారు.   విచారణ పూర్తవ్వకముందే  కేసీఆర్ నీ దోషిగా తేలుస్తున్నారని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే  ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని  ప్రభుత్వ తరపు న్యాయవాది అన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో విద్యుత్ ఇబ్బందులు  ఉండటంతో ఛత్తీస్ ఘడ్ తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారని  కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  3 రూపాయల 90 పైసలకు  యూనిట్ చొప్పున పవర్ కొన్నారని చెప్పారు. అయితే  ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా... నెగోషియేషన్ ప్రకారం ఎందుకు పవర్ కొన్నారని  సుప్రీం కోర్టు ప్రశ్నించగా.. అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కోర్టుకు చెప్పారు .  

కేసీఆర్ తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు నోటీసిలు ఇచ్చామని  తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.  పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల జూన్ 30 వరకు రిప్లై ఇవ్వలేమని కేసీఆర్ చెప్పారని తెలిపారు.  దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మిస్తుంటే... భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించారు.. దీంతో ప్రభుత్వ ఖజానాకి వ్యయం పెరిగిందని చెప్పారు.

Also Read:అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్

 ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం  కీలక వ్యాఖ్యలు చేసింది.  ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి తన సొంత ఒపినియన్ చెప్పినట్లు అనిపిస్తుందన్నారు చీఫ్  జస్టిస్ డీవై చంద్రచూడ్ .  విచారణ జరుగుతున్న టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అని అన్నారు.   జూడిషియల్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.   కొత్త  ఛైర్మెన్ ను నియమించి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది.  కొత్త ఛైర్మన్ ఎవరిని నియమిస్తామనేది జూలై 16న మధ్యాహ్నం చెబుతామని  తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.