
ఐపీఎల్ 2025 లో ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 2 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఒకరకంగా ఇది ఇరు జట్లకు సెమీ ఫైనల్ లాంటిది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ముంబై ఇండియన్స్ ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ముంబై స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో ఒక ఆల్ టీమ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు.
ALSO READ | ఈ సారి IPL టైటిల్ ఆ జట్టుదే.. టోర్నీ విజేత ఎవరో జోస్యం చెప్పిన వార్నర్..!
ఈ సీజన్ లో సూర్య కుమార్ యాదవ్ అసాధారణ నిలకడతో అదరగొడుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 15 ఇన్నింగ్స్ ల్లో 25 కంటే ఎక్కువ పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు మరో రికార్డ్ పై కన్నేశాడు. ఈసీజన్ లో 15 ఇన్నింగ్స్ ల్లో సూర్య 673 పరుగులు చేసి టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సూర్య మరో 15 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో ఓపెనర్ గా కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ 2016 ఐపీఎల్ సీజన్ లో 687 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు. 2018ఐపీఎల్ లో రిషబ్ పంత్ 684 చేసి తృటిలో ఈ రికార్డ్ మిస్ చేసుకున్నాడు.
ఐపీఎల్ సీజన్లో నాన్-ఓపెనర్లు చేసిన అత్యధిక పరుగులు:
687 - ఎబి డివిలియర్స్ (2016)
684 - రిషబ్ పంత్ (2018)
673 - సూర్యకుమార్ యాదవ్ (2025)
622 - కేన్ విలియమ్సన్ (2018)
605 - సూర్యకుమార్ యాదవ్(2023)
578 - విరాట్ కోహ్లీ (2013)
క్వాలిఫయర్ 2 విషయానికి వస్తే లీగ్ దశలో టాపర్గా నిలిచినప్పటికీ ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి శ్రేయస్ అయ్యర్ సేనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కలతో ఉన్న కింగ్స్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. మరోవైపు, ఎలిమినేటర్లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ ఫుల్ జోష్తో ఆరో టైటిల్ దిశగా మరో అడుగు వేసింది. మరి,సెమీఫైనల్ లాంటి ఈ పోరులో నెగ్గి మంగళవారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొట్టేది ఎవరో చూడాలి.