
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాస్ట్ స్టేజ్కు చేరుకుంది. ఈ సీజన్లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ 1లో పంజాబ్ను చిత్తు చేసి ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. క్వాలిఫయర్ 2లో పంజాబ్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం (జూన్ 1) పంజాబ్, ముంబై అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇందులో గెలిచిన జట్టు.. 2025, జూన్ 3న ఫైనల్లో టైటిల్ కోసం ఆర్సీబీతో పోటీ పడనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్ విజేత ఎవరో ఆసీస్ మాజీ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ జోస్యం చెప్పాడు. ఈ సారి ఐపీఎల్ విజేతగా ఎవరు నిలుస్తారు..? అని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ డేవిడ్ వార్నర్ ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన వార్నర్.. 2025 ఐపీఎల్ టోర్నీ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు నిలుస్తోందని ఆన్సర్ ఇచ్చాడు.
ALSO READ | ఆర్సీబీని ఢీకొట్టేదెవరు? ఇవాళ ( జూన్ 1 ) ముంబై-పంజాబ్ మధ్య క్వాలిఫయర్-2
అంతేకాకుండా ఫైనల్ మ్యాచులో స్టార్ బౌలర్ జోష్ హాజల్వుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్కు ఎంపిక అవుతాడని వార్నర్ జోస్యం చెప్పాడు. సోషల్ మీడియాలో వార్నర్ ప్రిడిక్షన్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 2016లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ఆర్సీబీకి టైటిల్ దూరం చేసిన వార్నర్.. జాలితో ఈ సారి ఆర్సీబీ జట్టు కప్ గెలవాలని కోరుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2016లో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరుకోగా.. ఈ మ్యాచులో వార్నర్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ ఇప్పటి వరకు మొత్తం నాలుగు సార్లు ఫైనల్కు చేరుకుంది. ఇందులో మూడు సార్లు తుదిపోరులో ఆ జట్టు ఓటమి పాలైంది. మరీ ఈ సీజన్లోనైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే ఆ జట్టు చిరకాల వాంఛ తీరుతుందో లేదో చూడాలి.