IND vs ZIM: హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియాకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, మరో ఎండ్ లో ఉన్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం క్రీజులో ఉన్నంత సేపు జింబాబ్వే బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద వైభవ్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇక బరిలోకి దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 25 పరుగులు చేసిన తర్వాత బ్రియన్ బెన్నెట్ బౌలింగ్ లో డగౌట్ కి చేరుకున్నాడు.
ఇక ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. సునామీ బ్యాటింగ్ తో జట్టు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించే క్రమంలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా 81 పరుగులు కొట్టిన తర్వాత ఔట్ అయి పెవిలియన్ కు చేరాడు ఇషాన్. అనంతరం మైదానంలోకి వచ్చిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడుతు అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
అనంతరం ఇషాన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఫినిషర్ రింకు సింగ్ ఈసారి పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కేవలం 12 రన్స్ మాత్రమే కొట్టి త్వరగానే పెవిలియన్ చేరాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి తలో వికెట్ తీసుకున్నారు.
