
ఆందోళనలు, ధర్నాలు, నిరసనల టైంలో మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే గతంలో పోలీసులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఎంపికైన 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో ‘స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్’ పేరుతో ఓ టీమ్ ఏర్పాటు చేశారు. సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కరాటేతోపాటు, ధర్నాల సమయాలలో మహిళలను అదుపులోకి తీసుకుని సురక్షితంగా తరలించాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
మంగళవారం గోషామహల్ పోలీస్ స్టేడియంలో స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్ సభ్యులు మాక్డ్రిల్స్ నిర్వహించారు. త్వరలోనే మరికొంత మందిని చేర్చుకుని 42 మందితో రెండు ప్లాటూన్లుగా విభజిస్తామని సీపీ సీవీ ఆనంద్తెలిపారు. అలాగే గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ పనులను ఆయన పరిశీలించారు. పోలీస్ శాఖకు చెందిన బ్లాకులను తరలిస్తున్నామని తెలిపారు. హార్స్ గ్రౌండ్, గుర్రపుశాలను తాత్కాలికంగా గోషామహల్ పోలీస్ స్టేడియంలోని ఖాళీ స్థలంలోకి తరలించామన్నారు. – వెలుగు, బషీర్బాగ్