తెలంగణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(అక్టోబర్ 2)స సికింద్రాబాద్ పరిధిలోని మొండా డివిజన్ సాంబమూర్తి నగర్, ఆదయ్య నగర్, గ్యాస్ మండిలలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి తలసాని పుట్టి పెరిగిన ఆదయ్య నగర్ లోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, గ్రేటర్ లో అన్ని స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. అనుమానమే లేదని.. రాష్ట్రంలో 78 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రచారంలో భాగంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్ళిన తలసాని.. తనకు ఓటు వేయాలని కోరారు.
ALSO READ : బీఆర్ఎస్ లోకి కాసాని.. గోషామహల్ నుంచి పోటీనా..!