ద్రాస్: ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి చర్చలు జరిపినా అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అది అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగమేనని తేల్చిచెప్పారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్లోని ద్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆదివారం ఆయన నివాళులర్పించారు.
అనంతరం రాజ్నాథ్ మాట్లాడుతూ.. భారత్పై దాడి చేయాలని చూస్తే ఏంజరుగుతుందో ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఇప్పటికే నిరూపించామని గుర్తుచేశారు. 1999 కార్గిల్ విజయం భారత్ ముఖచిత్రంలో ఒక వజ్రం లాంటిదని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.
