ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో  ఓ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. జులై 31వ తేదీ సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం  చోటు చేసుకుంది.  అతివేగంగా ఢీకొట్టుకోవడంతో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ..వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జులై 30వ తేదీ ఆదివారం మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో  లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఢీకొట్టడంతో అతను మరణించాడు. మృతుడు సతీష్ కుమార్‌గా గుర్తించారు.  బ్రేకు ఫెయిల్ అవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని.. టోల్ బూత్ వద్ద సతీష్ కుమార్ లారీని ఆపడానికి ప్రయత్నించగా.. అది అతనిని ఢీకొట్టి కొన్ని మీటర్ల ఈడ్చుకుంటూ వెళ్లిందని పోలీసులు తెలిపారు.