తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కావేరీ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కొవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. చికిత్సకు స్పందిస్తున్న స్టాలిన్ కోలుకుంటున్నారని, మరికొన్ని ఆరోజులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు.
ఇదిలా ఉంటే హాస్పిటల్ చికిత్స పొందుతున్న స్టాలిన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం చేసిన కరోనా పరీక్షలో స్టాలిన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఇక తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా 2,283 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు.
Tamil Nadu CM MK Stalin, who was admitted to a Chennai hospital yesterday for "investigation and observation for COVID19-related symptoms," is recovering well and is in good health. He has been advised rest for a few more days." pic.twitter.com/dqexMJ7lh9
— ANI (@ANI) July 15, 2022