ఆదివాసీలపై దాడులు ఆపండి

ఆదివాసీలపై దాడులు ఆపండి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆదివాసీ మహిళలపై పోలీసులు, ఫారెస్ట్‌‌ అధికారుల దాడులను ఆపాలని సీఎం కేసీఆర్‌‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం లేఖ రాశారు. వాళ్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి, బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. 2014 వరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. మంచిర్యాల జిల్లా కోయపోచగూడెంలో గిరిజనులు 2002కు ముందే పోడు చేసుకున్నారని, అక్కడ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు.