సీఎం కేసీఆర్​కు తమ్మినేని వీరభద్రం లేఖ

సీఎం కేసీఆర్​కు తమ్మినేని వీరభద్రం లేఖ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో సీసీఎస్, పీఎఫ్  బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు ఆదివారం ఆయన లేఖ రాశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ సమస్యలపై మంత్రులు చర్చలు జరుపుతున్నారని, కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు.

పెండింగ్‌లో ఉన్న 5 డీఏల్లో రెండింటిని ఈ నెల జీతంతో అమలు చేస్తామని, సకల జనుల సమ్మెకాలం జీతం చెల్లిస్తామని ప్రకటించడం, ఉద్యోగ విరమణ చేసిన వారి టెర్మినల్‌ బెనిఫిట్స్‌ కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈసీ అనుమతి రాగానే కార్మిక సంఘాలతో చర్చించి పీఆర్సీ ప్రకటించాలని తమ్మినేని కోరారు.