జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత..12 ఏళ్ల తర్వాత తొలి వికెట్

జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత..12 ఏళ్ల తర్వాత తొలి వికెట్

బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత సాధించాడు. 12 ఏళ్ల తర్వాత టెస్ట్ టీమ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఉనద్కట్..సుదీర్ఘ కాలం తర్వాత టెస్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భారత తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు. 2010లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా జయదేవ్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఘనత మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ పేరు మీద ఉంది. ఇప్పుడు ఉనద్కట్ అతన్ని అధిగమించాడు. పార్దీవ్ పటేల్ 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  గాయం కారణంగా  షమీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు దూరం కావడంతో...ఉనద్కట్కు అవకాశం దక్కింది.

అత్యధిక వికెట్లు..

విజయ్ హజారే ట్రోఫీలో జయదేవ్ ఉనద్కట్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా సౌరాష్ట్రను విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్‌గా నిలబెట్టాడు. 2019 -20 రంజీ ట్రోఫీలో 67 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 353 వికెట్లు  తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణించడంతో...ఉనద్కట్..మళ్లీ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.