
డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2024లో ప్రారంభమయ్యే 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో 30 అడ్మిషన్స్కు అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ : సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ లో అడ్మిషన్స్ ఉన్నాయి.
అర్హత : సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ : అప్లికేషన్స్ షార్ట్లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.