- మండుటెండలో గంటల తరబడి స్టూడెంట్ల నిరీక్షణ
న్యూఢిల్లీ: క్యూట్యూజీ 2026 ఎగ్జామ్ శనివారం దేశవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో గంటల తరబడి ఆలస్యంగా మొదలైంది. దీంతో లక్షలాదిమంది విద్యార్థులు ఎగ్జామ్సెంటర్ల వద్ద మండుటెండలో నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు విద్యార్థులు తమను సెంటర్లోనికి వెళ్లనివ్వడం లేదని.. ఏం జరిగిందో కూడా చెప్పడంలేదని, ఎగ్జామ్ టైమ్ అవుతున్నా తమను గేట్ల వద్దే ఎండలో నిలిపేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇబ్బంది పడుతున్న స్టూడెంట్ల వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
నీట్, సీబీఎస్ఈ వివాదాలకు తోడు ఈ ఎగ్జామ్ విషయంలో గందరగోళంపై నెలకొనడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే, ఈ పరీక్షలకు టెక్నికల్సర్వీసెస్ అందిస్తున్న టీసీఎస్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని నేషనల్టెస్టింగ్ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. సమస్యను పరిష్కరించి ఎగ్జామ్ మొదలుపెట్టినట్లు తెలిపింది.
టెక్నికల్ గ్లిచ్ వల్ల ఎగ్జామ్ కొన్ని గంటలు ఆలస్యమవడంపై టీసీఎస్ సీ ఈవో కృతివాసన్ క్షమాపణ చెప్పారు. సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు తెలిపారు. ఎన్టీఏ మధ్యాహ్నం సెషన్ వేళలు మార్చింది. ఉదయం సెషన్ ఎగ్జామ్ ఆలస్యమైనప్పటికీ పరీక్ష రాసే విద్యార్థులకు పూర్తి సమయం కల్పించినట్టు చెప్పారు. అలాగే సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్, cuet-ug@nta.ac.in మెయిల్ అందుబాటులో ఉంచారు.
సెంట్రల్యూనివర్సిటీలతోపాటు పలు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎన్టీఏ సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తుంది. వివిధ దశల్లో ఉండే ఈ పరీక్ష మే 11 నుంచి మే 31 వరకు జరగనుంది. గతంలో క్యూట్ ఎగ్జామ్ నిర్వహణలో పలు సమస్యలు, ఇబ్బందులు తలెత్తాయి. కాగా, క్యూట్ యూజీ ఎగ్జామ్ ఆలస్యంపై ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘ఫస్ట్ నీట్, తర్వాత సీబీఎస్ఈ, ఇప్పుడు క్యూట్’’ అని మాజీ ఢిల్లీ సీఎం ఆతిశీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై విమర్శలు గుప్పించారు.
