విచారణకు పిలిచి స్టేషన్లో 6 గంటలు ఖాళీగా కూర్చోబెట్టారు

విచారణకు పిలిచి స్టేషన్లో 6 గంటలు  ఖాళీగా కూర్చోబెట్టారు

తనపై వ్యక్తిగత కక్ష్య, రాజకీయ అండదండలతోనే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు తీన్మార్ మల్లన్న. ఓ కేసులో రెండు రోజుల కిందట చిలకలగూడ పోలీసులు 41 CRPC నోటీసులు జారిచేయడంతో…స్టేషన్ కు తన అడ్వొకేట్స్ తో కలిసి విచారణకు హారయ్యారు. విచారణ కోసం పిలిపించి... తనని 6 గంటల సేపు స్టేషన్ లో ఖాళీగా కూర్చోబెట్టారన్నారు మల్లన్న. ఎలాంటి ప్రశ్నలు అడగాలో అర్థం కాని పరిస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. విచారణ తర్వాత 8వ తేదీన మరోసారి స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసు జారీ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా  పోలీస్ స్టేషన్ దగ్గరకు పెద్ద ఎత్తున అభిమానులు.. వివిధ సంఘాల పార్టీల నాయకులు చేరుకున్నారు.