- ఆదిలాబాద్ జిల్లా కజ్జర్ల వద్ద 4 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు
- ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా 73.25 ఎకరాలు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: గ్రీన్ఎనర్జీని పెంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా18 చోట్ల 19 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి రూ.66.50 కోట్లు కేటాయించినట్టు విద్యుత్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శనివారం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 73.25 ఎకరాల సర్కారు భూమిని గుర్తించగా తొలుత పైలట్ ప్రాజెక్టు కోసం ఆదిలాబాద్ జిల్లా కజ్జర్లలో 4 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్టు ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించి జీవో 11ను విడుదల చేశారు. 2029-–30 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 8, ఉత్తర డిస్కమ్ పరిధిలో 11 మెగావాట్ల సోలార్పవర్ ప్లాంట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. కజ్జర్లలో సౌర విద్యుత్ ప్లాంట్ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని వెల్లడించారు. సదరు సంస్థ ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుంటుందని తెలిపారు.
