వైఎస్సార్ సేవ‌ల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రిచిపోరు

వైఎస్సార్ సేవ‌ల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రిచిపోరు

హైద‌రాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా ఆయ‌న‌కు ఘన నివాళులు అర్పించారు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు. పంజాగుట్ట వద్ద వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, గాంధీభవన్ లో ఆయ‌న‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, పీసీసీ నాయకులు ఉపాధ్యక్షులు మల్లు రవి, బొల్లు కిషన్, అఫ్జలుద్దీన్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్ తదితరులు.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.

రాజశేఖర్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమ‌ని పీసీసీ నాయకులు, ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. అందరికి ఉచిత విద్య, అందరికి మెరుగైన వైద్యం అందించాలనే గొప్ప లక్ష్యంతో వైఎస్ పాలన చేశార‌ని తెలిపారు. వైఎస్ హ‌యాంలో చేప‌ట్టిన జలయజ్ఞం ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింద‌న్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సేవలు, ఆయన ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ పథకాల‌ను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు.