హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు స్వయంగా వీడియోలు చేసి పోస్ట్ చేయాలని సూచించారు. ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వలస కూలీలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను కేంద్రం దృష్టికి తేవాలన్నారు. మంగళవారం ఉత్తమ్ఫేస్ బుక్ లైవ్ లో రాష్ట్రంలోని పార్టీ నాయకులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఈ ఆన్లైన్ పోరాటంలో పాల్గొంటున్నారని, రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 10 వేల మంది కార్యకర్తలు సోషల్మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలని కోరారు. లాక్డౌన్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్రం దృష్టికి తెచ్చేలా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని పేదలకు నేరుగా రూ.10 వేలు అందించాలని, రోజు కూలీతో పని చేసే వారిని, చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలని, వలస కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కూలీలు కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తున్నారని.. ట్రక్కులు, లారీల్లో ఊర్లకు పోతున్నారని, వాళ్లకు సాయం చేసేందుకు తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్ తెలిపారు.
రేపు కాంగ్రెస్ ఆన్లైన్ పోరాటం
- తెలంగాణం
- May 27, 2020
లేటెస్ట్
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం