
గ్రేటర్ పరిధితో పాటు రూరల్ ఏరియాలో 28 బార్లకు జూన్ 13న ఎక్సైజ్కమిషనర్ హరికిరణ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. నార్సింగిలోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్లో 24 బార్లకు మొత్తం 3,525 దరఖాస్తులు రాగా, కమిషనర్ డ్రా బాక్స్ లోని కాయిన్స్ తీసి జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రికి ఇచ్చారు. ఆయన నంబర్లను వెల్లడించారు. కొత్త బార్లకు లైసెన్స్ వల్ల ప్రభుత్వానికి రూ. 36.68 కోట్ల ఆదాయం వచ్చింది.
జిల్లాలోని నాలుగు పబ్ లకు 148 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం3525 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యంత తీవ్రమైన పోటీ నెలకొంది. సరూర్నగర్లో సింగిల్ బార్ లైసెన్స్కు 57 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో పేర్లు వచ్చిన వారికి అలాట్మెంట్ లెటర్లను అందజేశారు. 90 రోజుల్లో ప్రాసెస్పూర్తి చేసి బార్లు నడిపించుకోవాలని కమిషనర్సూచించారు. ఈ గడువు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.