అండర్19 వరల్డ్​ కప్​ టీమ్‌‌‌‌కు ఎంపికైన తెలంగాణ యంగ్​స్టర్​

అండర్19 వరల్డ్​ కప్​ టీమ్‌‌‌‌కు ఎంపికైన తెలంగాణ యంగ్​స్టర్​

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణ యువ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌ గొంగడి త్రిష రాష్ట్రం గర్వించేలా చేసింది. చిన్న వయసులోనే ఆటలో సంచలనాలు సృష్టిస్తున్న ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ త్రిష..  అండర్‌‌‌‌19 విమెన్స్‌‌‌‌ టీ20  వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో పాల్గొనే ఇండియా టీమ్‌‌‌‌కు ఎంపికైంది. జనవరి 14 నుంచి 29 వరకు సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఆలిండియా విమెన్స్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ సోమవారం ప్రకటించిన జట్టు లో 16 ఏండ్ల త్రిషకు ప్లేస్‌‌‌‌ దక్కింది.

తొలిసారి జరిగే ఈ టోర్నీలో పాల్గొనే జట్టుకు టీమిండియా ఓపెనర్‌‌‌‌ షెఫాలీ వర్మ కెప్టెన్‌‌‌‌గా ఎంపికైంది. ఈ టోర్నీకి ప్రిపరేషన్‌‌‌‌గా  సౌతాఫ్రికాలో ఇండియా అమ్మాయిలు  ఐదు టీ20ల సిరీస్‌‌‌‌ కూడా ఆడనున్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 4 వరకు జరిగే ఈ సిరీస్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు ఎంపికైన జట్టే పోటీ పడనుంది. హెచ్‌‌‌‌సీఏ ప్లేయర్‌‌‌‌ అయిన త్రిషతో పాటు ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఎం.డి. షబ్నమ్‌‌‌‌ కూడా  మెగా టోర్నీకి ఎంపికవడం విశేషం. ఇక, హెచ్‌‌‌‌సీఏకు చెందిన యశశ్రీ స్టాండ్‌‌‌‌బై ప్లేయర్‌‌‌‌గా సెలెక్ట్‌‌‌‌ అయింది.