పలువురు ఐఏఎస్​లకు ప్రమోషన్లు..ప్రిన్సిపల్​ సెక్రటరీలుగా శేషాద్రి, రిజ్వీ

పలువురు ఐఏఎస్​లకు ప్రమోషన్లు..ప్రిన్సిపల్​ సెక్రటరీలుగా శేషాద్రి, రిజ్వీ
  • 14 మంది ఐఏఎస్​లకు  జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో 14 మందికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి దక్కింది. సీఎం సెక్రటరీగా ఉన్న 1999 బ్యాచ్​కు చెందిన శేషాద్రికి ప్రిన్సిపల్​ సెక్రటరీగా, ఎనర్జీ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి ప్రిన్సిపల్​సెక్రటరీ పదోన్నతి లభించింది.

 ఇక జూనియర్​ అడ్మినిస్ర్టేటివ్​ గ్రేడ్​ పదోన్నతులు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ప్రమోషన్ పొందినవారిలో 2015కు చెందిన ఐఏఎస్​లు పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీశ్, జి. రవి, కె.నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.