అమిత్ షా వీడియో మార్ఫింగ్‌‌‌‌ కేసు.. మహేశ్ గౌడ్ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు అసంతృప్తి

అమిత్ షా వీడియో మార్ఫింగ్‌‌‌‌ కేసు.. మహేశ్ గౌడ్ పిటిషన్‌‌‌‌పై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్‌‌‌‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్ కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.  

మహేశ్ కుమార్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో తెలంగాణ పీసీసీకి చెందిన పిటిషనర్లను అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.