తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కిషోర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్యే గాదరి కిషోర్ పిటిషన్ ను కొట్టివేసింది. సాక్షులు లిస్ట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది హైకోర్టు.
మరో మూడు నెలల్లో జరగాల్సిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి మరోసారి గాదరి కిశోర్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుంగతుర్తి (ఎస్సీ) నియోజక వర్గం నుంచి గాదరి కిశోర్ పేరును ప్రకటించారు. ఈ క్రమంలో కిషోర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన ఎన్నికపై హైకోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది.