హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలన్న మంత్రి అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. మంత్రిపై వేసిన మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను విచారణకు అనుమతించింది.
ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రాఘవేంద్ర రాజు. అయితే ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు.
రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తిరస్కరిస్తూ, రాఘవేంద్ర రాజు పిటిషన్ ను విచారణకు అనుమతి ఇచ్చింది.