టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

టీచర్ల బదిలీలకు  తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

ఉపాధ్యాయుల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది.  టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  టీచర్ యూనియన్ల నేతలకు 10  అదనపు పాయింట్లను తప్పుపట్టిన హైకోర్టు.. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు  అనుమతిచ్చింది. 

ALSO READ :ఇల్లు అలకగానే పండగ కాదు.. ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉంది

ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు  కేటాయించడానికి అనుమతించింది.  భార్యభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని తెలిపింది.   టీచర్ల బదిలీలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది హైకోర్టు.