హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు జడ్జిలు ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో సీజే వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
అడ్వొకేట్స్ కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి, లా ఆఫీసర్ల కోటా నుంచి సుజన కళాసికం (హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్)తో అదనపు న్యాయమూర్తులుగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయిస్తారు. హైకోర్టులో మొత్తం ఉండాల్సిన జడ్జిల సంఖ్య 42 కాగా, 34 మంది ఉన్నారు.