మున్సిపల్ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్

మున్సిపల్ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్

తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.  జులైలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన మళ్లీ జరపాలని ఆదేశించింది. 73 మున్సిపాలిటీలపై ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. 14 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. వార్డుల విభజన సరిగా లేదంటూ దాఖలైన పిటిషన్ పై  హైకోర్టు విచారణ జరిపింది.